*సూరారం బస్టాప్ వద్ద బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం…* *సూరారం, సాయిబాబా నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్…* సుభాష్ నగర్ 130 డివిజన్, సూరారం బస్ స్టాప్ వద్ద బిజెపి ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశానికి సూరారం కాలనీ సాయిబాబా నగర్ తదితర బస్తీల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై, బిజెపికి మద్దతుగా నిలిచారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ.. అబద్ధపు హామీలు, మాయమాటలతో 9 ఏండ్లు కుత్బుల్లాపూర్ ప్రజలను ఈ బీఆర్ఎస్ అభ్యర్థి మోసం చేసిండు.. మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే కుత్బుల్లాపూర్ ఆగం అవుద్ది. కాంగ్రెస్ అభ్యర్థి కి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు. అధికారంలో ఉన్నా లేకున్నా, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా. సూరారం కాలనీ సర్వేనెంబర్ 107 లో నెలకొన్న రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి, పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇప్పిస్తా. సూరారంని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని.. దొంగ హామీలు ఇచ్చి, ఇప్పటికీ కన్నెత్తి చూడలేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాటలు నమ్మితే.. మళ్ళీ ఐదేండ్లు ఆగం అవుతాం.. ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి గారు, సుభాష్ నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
- All Posts
- November 18, 2023
- No Comment
- 859
సూరారం బస్టాప్ వద్ద బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం…*
సూరారం, సాయిబాబా నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్…*
సుభాష్ నగర్ 130 డివిజన్, సూరారం బస్ స్టాప్ వద్ద బిజెపి ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశానికి సూరారం కాలనీ సాయిబాబా నగర్ తదితర బస్తీల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై, బిజెపికి మద్దతుగా నిలిచారు.
బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..
అబద్ధపు హామీలు, మాయమాటలతో 9 ఏండ్లు కుత్బుల్లాపూర్ ప్రజలను ఈ బీఆర్ఎస్ అభ్యర్థి మోసం చేసిండు..
మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే కుత్బుల్లాపూర్ ఆగం అవుద్ది.
కాంగ్రెస్ అభ్యర్థి కి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు.
అధికారంలో ఉన్నా లేకున్నా, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా.
సూరారం కాలనీ సర్వేనెంబర్ 107 లో నెలకొన్న రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి, పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇప్పిస్తా.
సూరారంని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని.. దొంగ హామీలు ఇచ్చి, ఇప్పటికీ కన్నెత్తి చూడలేదు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాటలు నమ్మితే.. మళ్ళీ ఐదేండ్లు ఆగం అవుతాం..
ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని అభ్యర్తించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి గారు, సుభాష్ నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.